47
ఫిలిష్తీయుల గురించిన సందేశం 
  1 ఫరో ఇంకా గాజా మీద దాడిచేయక ముందు ఫిలిష్తీయుల గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు:   
 2 యెహోవా ఇలా చెప్తున్నారు:  
“ఉత్తరాన జలప్రవాహాలు ఎలా ఎగసిపడుతున్నాయో చూడండి;  
అవి వరదలా పొంగి పొర్లిపారుతాయి.  
అవి దేశం మీద, అందులో ఉన్న వాటన్నిటి మీద,  
పట్టణాల మీద, వాటిలో నివసించేవారి మీద పొర్లిపారుతాయి.  
కాబట్టి ప్రజలంతా మొరపెడతారు;  
దేశంలో నివసించేవారంతా ఏడుస్తారు.   
 3 పరుగెత్తే గుర్రాల డెక్కల శబ్దానికి,  
శత్రు రథాల శబ్దానికి  
వాటి చక్రాల శబ్దానికి వారు రోదిస్తారు.  
తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేయరు;  
వారి చేతులు బలహీనంగా ఉంటాయి.   
 4 ఎందుకంటే ఆ రోజు వచ్చింది,  
ఫిలిష్తీయులందరినీ నాశనం చేసే రోజు  
తూరు, సీదోనులకు సహాయం చేసేవారందరిని  
తొలగించే రోజు తప్పకుండా వస్తుంది.  
యెహోవా ఫిలిష్తీయులను,  
కఫ్తోరు*అంటే, క్రేతు తీరాల్లో మిగిలి ఉన్నవారిని నాశనం చేయబోతున్నారు.   
 5 గాజా దుఃఖంలో తల క్షౌరం చేసుకుంటుంది;  
అష్కెలోను నిశ్శబ్దం చేయబడుతుంది.  
సమతల మైదానంలో మిగిలి ఉన్నవారలారా,  
ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపరచుకుంటారు?   
 6 “ ‘అయ్యో, యెహోవా ఖడ్గమా,  
నీవు ఎంత కాలానికి విశ్రాంతి తీసుకుంటావు?  
నీ ఒర లోనికి తిరిగివెళ్లి  
ప్రశాంతంగా విశ్రమించు.’   
 7 అయితే అష్కెలోను మీదా,  
సముద్ర తీర ప్రాంతాల మీద దాడి చేయమని,  
యెహోవా దాన్ని ఆజ్ఞాపించినప్పుడు,  
అది ఎలా విశ్రమిస్తుంది?”